నిజామాబాద్ క్రైం, జూన్ 26: నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలువురు కానిస్టేబుళ్లను బదిలీ చేశారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజు ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని బదిలీచేయడంతోపాటు వారికి పోస్టింగ్ కల్పిస్తూ ఆర్డర్స్ జారీ చేశారు.
మొత్తం 29 మంది సివిల్ కానిస్టేబుళ్ల రిక్వెస్ట్(అభ్యర్థన) పరిగణలోకి తీసుకొని బదిలీలు చేశారు. బదిలీ అయిన సిబ్బందిని వారి పోలీస్ స్టేషన్ల నుంచి వెంటనే రిలీవ్ చేయాల్సిందిగా సంబంధిత ఎస్హెచ్వోలకు సీపీ నాగరాజు ఆదేశాలు ఇచ్చారు.