కమ్మర్పల్లి, డిసెంబర్ 24 : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కృషితో బాల్కొండ నియోజక వర్గంలో పెద్ద ఎత్తున హెల్త్ సబ్ సెంటర్ల ఏర్పాటుకు అవకాశం కలిగింది. నియోజక వర్గానికి రూ.3.20 కోట్లతో ఏకంగా 16 కొత్త హెల్త్ సబ్ సెంటర్లు మంజూరు కాగా వాటి పనుల ప్రారంభోత్సవాల సందడి కొనసాగుతున్నది.మంజూరైన వాటిలో మూడింటిని మంత్రి వేముల శనివారం ప్రారంభించారు. భీమ్గల్ మండలం పిప్రి, ఏర్గట్ల మండలం తడ్పాకల్, మోర్తాడ్ మండలం పాలెంలో నూతన సబ్ సెంటర్ల నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు.
నియోజక వర్గంలో దవాఖానల అభివృద్ధి, కొత్త పీహెచ్సీల మంజూరు, గిఫ్ట్ ఏ స్మైల్ అంబులెన్సు లాంటి వాటితో ప్రజల ఆరోగ్యం, వైద్య సేవల కోసం ఇతోధికంగా కృషి చేసిన మంత్రి వేముల?? తాజాగా ఏకంగా 16 సబ్ సెంటర్లు మంజూరు చేయించారు. వాటి నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేస్తున్న తరుణంలో ప్రజలు మంత్రి ప్రత్యేక కృషిని అభినందిస్తున్నారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావుకు మంత్రి వేముల ధన్యవాదాలు తెలిపారు. మారు మూల ప్రాంతాల ప్రజలకు ఈ సబ్ సెంటర్లు ఎంతో ఉపయోగపడుతాయని మంత్రి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.