వేల్పూర్, సెప్టెంబర్ 7: మండలంలోని జలాల్పూర్, వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామాల నుంచి కాంగ్రెస్, బీజేపీకి చెందిన 150 మంది గురువారం మంత్రి వేముల సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీఆర్ఎస్లో చేరిన వారికి ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వానికి మద్దతుగా నిలువాలని కోరారు. నియోజకవర్గ ప్రజలే తన కుటుంబ సభ్యులుగా భావించి తొమ్మిదేండ్లుగా రూ. వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.
ఒక్క జలాల్పూర్లోనే కోటి రూపాయలతో రోడ్లు నిర్మించినట్లు చెప్పారు. నియోజకవర్గ స్థాయి కులసంఘాల భవనాలకు రూ.100 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.ఎన్నికల వేళ చాలా మంది వచ్చి చాలా రకాల మాటలు చెబుతారు కానీ మనకు అందుబాటులో ఉన్నది ఎవరు? కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నది ఎవరు? అభివృద్ధి చేసింది ఎవరనేది ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. నేడు కేసీఆర్తోనే రాష్ట్రంలో జనరంజక పాలక సాగుతోందని, ఆయనకు ప్రజలు మద్దతుగా నిలువాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు ప్రవీణ్రెడ్డి, నాగధర్, అంక్సాపూర్ సర్పంచ్ రాజేశ్వర్రెడ్డి, ఉపసర్పంచ్ రిక్క మధు, రైతుబంధు సమితి జిల్లాసభ్యులు మిట్టాపల్లి మహిపాల్, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే జీవన్రెడ్డి సమక్షంలో..
నందిపేట్, సెప్టెంబర్ 7 : కేసీఆర్ ఆదర్శన పాలనకు ఆకర్షితులై అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్కే మద్దతు పలుకుతున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. మండలంలోని ఆంధ్రనగర్ జీపీ పరిధిలో ఉన్న ఇందిరానగర్ కాలనీవాసులు గురువారం ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్కే మద్దతు తెలుపుతున్నట్లు తీర్మానం చేశారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవన్రెడ్డి మాట్లాడుతూ.. తాము నిరంతరం ప్రజాసంక్షేమం కోసం పని చేస్తున్నామని పేర్కొన్నారు. ఇంటింటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. కేసీఆర్ పాలనను ప్రతిఒక్కరూ మెచ్చుకుంటున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయమని ధీమా వ్యక్తంచేశారు.