బోధన్, సెప్టెంబరు 27: బోధన్ డివిజన్లోని మంజీరా నది తీరంలోని అనేక గ్రామాలకు వ రద ముప్పు పొంచి ఉంది. సోమవారం ఉద యం నుంచి గంటగంటకూ వరద ఉధృతి పె రుగుతుండడంతో బోధన్ మండలంలోని ముంపు గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మూడు రోజులుగా మంజీర, గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఎ గువన ప్రాజెక్టుల నుంచి పెద్ద ఎత్తున నీటి విడుదల చేస్తుండడంతో బోధన్ మండంలోని బిక్నె ల్లి, హంగర్గా తదితర గ్రామాల్లో పంట పొలా లు నీట మునుగుతున్నాయి. ఒకపక్క మంజీర నీరు, మరోపక్క శ్రీరాంసాగర్ నుంచి నీటి విడుదల సకాలంలో జరగకపోవడంతో బ్యాక్ వాటర్ ఫలితంగా భిక్నెల్లి, హంగర్గా గ్రామాలు అప్పట్లో వరద నీటిలో చిక్కుకున్నాయి. ప్రస్తుతం మరోసారి అటువంటి ప్రమాదం ఎదురుకాబోతుందని ఆ రెండు గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి 62 వేల క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేశారు. కాకివాగు, నల్లవాగు, కౌలా స్, మన్నాడి, లెండి వాగులు కూడా పొంగుతున్నాయి. దీంతో తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులో సాలూరా వద్ద మంజీరలో మంగళవారం ఉదయం నాటికి లక్ష క్యూసెక్కుల వర ద ప్రవాహం ఉండవచ్చని నీటిపారుదల నిపుణులు అంచనా వేస్తున్నారు. సాలూరా వద్ద ప్రస్తుతం మంజీరా నది పాత వంతెన ఎత్తుకు సమానంగా వరద నీరు ప్రవహిస్తోంది.
గోదావరి ఉగ్రరూపం..
మండలంలోని కందకుర్తి గోదావరినదిలో భారీ వరద అతలాకుతలం చేస్తున్నది. భారీ వర్షాలకు తోడుప్రాజెక్టుల నుంచి విడుదల చేస్తున్న మిగులు జలాలతో కందకుర్తి వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. అంతర్రాష్ట్ర సరిహద్దులో నిర్మించిన వంతెనను తాకుతూ వరద ప్రవహిస్తున్నది.