చందూర్/నిజామాబాద్ రూరల్/ డిచ్పల్లి/వేల్పూర్/ బాల్కొండ/ రెంజల్/ఎడపల్లి, నవంబర్ 5 : యాసంగిలో పంటల సాగు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయిల్పామ్ సాగుపై వ్యవసాయాధికారులు పలు గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఆయిల్పామ్ సాగు ద్వారా కలిగే ప్రయోజనాలు, ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీపై శనివారం అవగాహన కల్పించారు.
చందూర్ మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో వివిధ గ్రామాల రైతులకు వ్యవసాయ అధికారిణి శ్రావణి అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయిల్పామ్ సాగుపై వివరించారు. ఈ పంటను సాగు చేసే రైతులు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా, పట్టాదారు పాస్పుస్తకం జిరాక్స్, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలను జిల్లా హార్టికల్చర్ మరియు సెరీకల్చర్ అధికారి కార్యాలయానికి పంపాలని సూచించారు. ఆయిల్పామ్ మొక్క ఖరీదు రూ.193 ఉంటుందని, ప్రభుత్వం రైతుకు రూ. 20కే అందజేస్తున్నదని తెలిపారు. ఎకరానికి 57 మొక్కలు నాటాల్సి ఉంటుందని, అంతర పంటలు సాగుచేసుకోవచ్చని సూచించారు. నిర్వహణ ఖర్చును ఎకరానికి రూ.4,200 చొప్పున నాలుగు సంవత్సరాల పాటు ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమచేస్తుందని, డ్రిప్ సేద్యం ద్వారా నీరందించేందుకు 80 నుంచి వంద శాతం వరకు రాయితీ ఉంటుందని తెలిపారు. తోట నాటిన మూడు సంవత్సరాల తర్వాత దిగుబడి ప్రారంభమై.. 25 సంవత్సరాల వరకు కొనసాగుతుందని చెప్పారు. మూడు సంవత్సరాల వరకు అంతర పంటలు సాగు చేయవచ్చని వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ కర్లం సాయారెడ్డి, సొసైటీ చైర్మన్ మాధవరెడ్డి, బాబు పాల్గొన్నారు.
నిజామాబాద్ రూరల్ మండలం ఆకుల కొండూర్లో సర్పంచ్ మెట్టు అశోక్ అధ్యక్షతన రైతులతో సమావేశం నిర్వహించారు. ఆయిల్పామ్ సాగు విధానం – రాయితీపై మండల వ్యవసాయాధికారి హీరాజాదవ్ అవగాహన కల్పించారు. సమావేశంలో పాల్దా సొసైటీ చైర్మన్ జితేందర్, పంచాయతీ కార్యదర్శి ఉమ, రైతు ప్రతినిధులు ప్రవీణ్, ఎక్కల భూమయ్య, నర్సయ్య, రైతులు పాల్గొన్నారు.
డిచ్పల్లి మండలంలోని సుద్దపల్లిలో ఆయిల్పామ్ సాగుపై మండల వ్యవసాయాధికారి రాంబాబు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏడు మండలాల ఇన్చార్జి ఏడీ, ఏఈవో రూపేశ్, ఆయిల్పామ్ కంపెనీ సిబ్బంది, సర్పంచ్ రూపా సతీశ్రెడ్డి, ఎంపీటీసీ ఎంబడి సంతోషం, ఉపసర్పంచ్ సుద్ద గంగారాం, సొసైటీ వైస్చైర్మన్ కుమ్మరి చిన్నగంగారాం, రైతులు పాల్గొన్నారు.
వేల్పూర్ మండలంలోని అంక్సాపూర్, లక్కోర, వాడి గ్రామాల్లో ఆయిల్పామ్ సాగుపై మండల వ్యవసాయాధికారి నర్సయ్య అవగాహన కల్పించారు. ఎర్రజొన్న సాగు చేసే రైతులు సీడ్ కంపెనీతో బై బ్యాక్ ఒప్పందాలు చేసుకోవాలని సూచించారు. భీమ్గల్ డివిజన్ వ్యవసాయాధికారి కె.మల్లయ్య, అంక్సాపూర్ సర్పంచ్ రాజేశ్వర్రెడ్డి, ఎంపీటీసీ రవీందర్ పాల్గొన్నారు.
బాల్కొండ మండల కేంద్రంలో పీఎం కిసాన్ ఈ-కేవైసీ, ఎర్రజొన్న, ఆయిల్పామ్ పంటల సాగుపై ఏవో మహేందర్ రెడ్డి అవగాహన కల్పించారు. రైతుబంధు సమితి గ్రామ కో-ఆర్డినేటర్ కన్న పోశెట్టి, రాకేశ్ పాల్గొన్నారు.
రెంజల్ మండలం తాడ్బిలోలిలో ఆయిల్పామ్ సాగుపై ఏఈవో అజయ్ అవగాహన కల్పించారు. సర్పంచ్ సునీత, రైతుబంధు సమితి గ్రామ అధ్యక్షుడు హన్మంత్రావు తదితరులు పాల్గొన్నారు.
ఎడపల్లి మండల కేంద్రంలో ఆయిల్పామ్ సాగుపై ఏడీవో వాజిద్ హుస్సేన్ అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ కె.శ్రీనివాస్, ఉపసర్పంచ్ ఆకుల శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ పోల మల్కారెడ్డి, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండల అధ్యక్షుడు దేరడి శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.