మామడ : ఒకరంటే ఒకరికి ఇష్టం.. కానీ ఇద్దరి కులాలు వేరు.. తమ ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు తెలిస్తే పెద్దలు ఒప్పుకుంటారో లేదోనని భయపడ్డారు. ఇద్దరు కలిసి జీవించే పరిస్థితి లేనప్పుడు కలిసి తనువు చాలించడమే మార్గమనుకున్నారు. క్షణికావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గామంలో విషాదాన్ని నింపింది.
పొన్కల్ గ్రామానికి చెందిన కోండ నిశిత(18) మామడ జూనియర్ కళాశాలలో ఇటీవల ఇంటర్ పూర్తిచేసింది. ఇదే గామానికి చెందిన సిలివేరి హరీశ్(21) నిర్మల్ జిల్లా కేందంలోని ప్రైవేటు డిగ్రీ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. వీరిది ఒకే కాలనీ కావడంతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. కానీ కులాలు వేరుకావడంతో పెద్దలకు తెలిస్తే ఒప్పుకోరని భావించారు. ఎలాగూ కలిసి జీవితాన్ని పంచుకోలేమని, కనీసం చావులోనైనా ఒకటవుదామని నిర్ణయించుకున్నారు. ఈ కమంలో నిశిత ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి హరీశ్ ఆమె ఇంటికి వెళ్లాడు. వారు అనుకున్న ప్రకారం ఇంటిలోని గదిలో ఇద్దరు ఒకే చీరకు ఉరేసుకున్నారు.
ఇద్దరు ఉరేసుకోవడానికి ముందు హరీశ్ తన వాట్సాప్ స్టేటస్లో తాము చనిపోతున్న సమాచారాన్ని ఉంచాడు. ఇది చూసిన మిత్రులు, కుటుంబసభ్యులు ఫోన్ చేయగా స్విచాఫ్ వచ్చింది. కుటుంబసభ్యులు అనుమానంతో వెతుకగా.. నిశిత ఇంట్లో విగత జీవులుగా కనిపించారు. దీంతో ఇరు కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. ఈ మేరకు సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వినయ్ తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
జులై 5 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి కేటీఆర్
వెదజల్లే పద్దతిలో వరి సాగుతో అధిక లాభాలు : మంత్రి హరీశ్ రావు
ఆంధ్రా ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం : మంత్రి శ్రీనివాస్ గౌడ్
హరితహారాన్ని మించిన మరో గొప్ప కార్యక్రమం లేదు : కేటీఆర్