దోహా: ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం-తాలిబాన్ల మధ్య మరోసారి చర్చలు ప్రారంభమయ్యాయి. ఖతార్లోని దోహాలో శాంతి చర్చలు జరిపేందుకు ఇరువర్గాలు సమావేశమయ్యాయి. ఇరువర్గాలు ఇప్పటికే పలు దశల్లో చర్చలు జరిపాయి. ఇప్పుడు మళ్ళీ శాంతి కోసం ఒక కొత్త చొరవ ప్రారంభమైంది. ఆఫ్ఘన్ ప్రభుత్వ శాంతి చర్చల్లో పాల్గొన్న బృందం ఈ సమాచారాన్ని ట్వీట్ ద్వారా తెలియజేసింది.
తాలిబాన్ ప్రతినిధి సుహైల్ షాహీన్ కూడా సమావేశాన్ని ధ్రువీకరించారు. రంజాన్ పండుగ సందర్భంగా ఇరువర్గాలు ఒకరినొకరు అభినందనలు తెలుపుకున్నారు. యథాతథ స్థితిని కొనసాగించడం, చర్చలను ముందుకు తీసుకురావడంపై ఇరువర్గాలు మాట్లాడినట్లు తాలిబాన్ ప్రతినిధి ట్వీట్లో పేర్కొన్నారు. మసీదులో బాంబు దాడుల తర్వాత ఈ శాంతి చర్చలను ప్రారంభించాలని ఇరువర్గాలు నిర్ణయించాయి. మసీదులో జరిగిన పేలుడులో 12 మంది మరణించారు. ఈ పేలుళ్లకు ఏ సంస్థ కూడా బాధ్యత వహించలేదు.
అంతకుముందు ఏప్రిల్లో టర్కీలోని ఇస్తాంబుల్లో ఈ సమావేశం జరుగాల్సి ఉండగా, అది నిరవధికంగా వాయిదా పడింది. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికాతో పాటు నాటో దేశాల సైన్యం ఉపసంహరణ సెప్టెంబర్ 11 నాటికి పూర్తవుతుంది. ఆఫ్ఘనిస్తాన్లో శాంతి, రాజకీయ స్థిరత్వం కోసం తమ దేశం సహకరిస్తూనే ఉంటుందని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి మరోసారి పునరుద్ఘాటించారు. ఈద్ సందర్భంగా ఇరువైపుల నుంచి కాల్పుల విరమణ నిర్ణయం స్వాగతించదగినదని ఆయన అన్నారు.
పంచన్ లామా సమాచారం ఇవ్వండి.. చైనాను అడిగిన అమెరికా
ఎల్లుండి నుంచి హీరో బైకుల ఉత్పత్తి ప్రారంభం
స్పైస్జెట్ నిర్వాకం.. రోజంతా పైలట్లకు జాగారం..
100 పడకల కొవిడ్ కేంద్రం ఏర్పాటులో నటి జాక్వెలిన్ బిజీ
టీకాలు తీసుకున్నా.. మాస్క్లు మరువొద్దు : డాక్టర్ రణదీప్ గులేరియా
ఆధునిక హంగులతో రాజధానిని నిర్మిస్తున్న ఈజిప్ట్
“మీ ప్రియమైన వారి చేయి వదలకండి”: టీనా అంబానీ సందేశం
తెరపైకొచ్చిన మిక్కీ మౌస్.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..