బెంగళూర్ : కర్నాటకలో కొవిడ్-19 కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కర్నాటకలో దాదాపు 40,000 తాజా పాజిటివ్ కేసులు వెలుగుచూడగా, బెంగళూర్ లోనే 22,000 కేసులు నమోదవడం ఆందోళన రేకెత్తిస్తోంది.
ఇక ఒక్కరోజులోనే కర్నాటకలో మహమ్మారి బారినపడి 229 మంది మరణించారు. రాష్ట్రంలో కొవిడ్-19 పడకలకు ఇబ్బంది లేదని, అయితే ఆక్సిజన్ పడకలను సమకూర్చడంలో ఇంకా సవాళ్లు ఎదురవుతున్నాయని బీబీఎంపీ చీఫ్ కమిషనర్ పేర్కొన్నారు. సాధారణ పడకలకు ఆక్సిజన్ లైన్స్ వేయాలని అధికారులు ప్రభుత్వానికి విజ్ణప్తి చేస్తున్నారు. మరోవైపు బెంగళూర్ లో రెమ్డిసివిర్ కొరత వేధిస్తోంది. ఈ మందును బ్లాక్ మార్కెట్ కు తరలించి అధిక మొత్తాలకు విక్రయిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.