హైదరాబాద్: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశ పరీక్షల తేదీలను ప్రభుత్వం ప్రకటించింది. ఆరో తరగతి ప్రవేశ పరీక్ష జూన్ 6న, 7 నుంచి 9వ తరగతులకు జూన్ 5న నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. 2021-22 విద్యాసంవత్సరానికిగాను రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలో ప్రవేశాల కోసం మార్చి నెలలో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆన్లైన్ ద్వారా ఈనెల చివరి వరకు అప్లయ్ చేసుకోవచ్చు. పరీక్షకు సంబంధించిన హాల్టికెట్లను జూన్ మొదటివారంలో విడుదల చేస్తారు. అప్లికేషన్ ఫీజు రూ.150, ఎస్సీ, ఎస్సటీ, బీసీ విద్యార్థులకు రూ.75. పూర్తివివరాలకు https://telanganams.cgg.gov.in వెబ్సైట్ చూడవచ్చని సూచించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..