ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో కోలాహలం
60 డివిజన్ల నుంచి 522 పత్రాలు దాఖలు
ఖమ్మం, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఆదివారం నామినేషన్ల ఘట్ల పూర్తయింది. ఈ నెల 16 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా ఆదివారం సాయంత్రంతో ముగిసింది. నగరంలో 60 డివిజన్లకు గాను మొత్తం 522 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో టీఆర్ఎస్ నుంచి 163 సీపీఐ నుంచి ఏడు కాంగ్రెస్ పార్టీ నుంచి 125, బీజేపీ నుంచి 84, సీపీఎం నుంచి 35, ఇతరులు 76, గుర్తింపు పొందిన ఇతర రాష్ర్టాల పార్టీల నుంచి 16 నామినేషన్లు దాఖలయ్యాయి. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ నేతృత్వంలో అన్ని డివిజన్ల నుంచి టీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. సోమవారం లేదా మంగళవారం మంత్రి అభ్యర్థులకు బీఫారాలు అందజేయనున్నారు.
ఊపందుకున్న సమీకరణాలు..
సీపీఐతో టీఆర్ఎస్ జత కలవగా మరోవైపు కాంగ్రెస్, సీపీఎం, టీడీపీలు జత కలుస్తాయని స్థానికంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ మాత్రం ఒంటరిగానే బరిలో దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నది. ఈ నెల 22న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉండడంతో పలువురు ఉపసంహరించుకునే అవకాశం ఉన్నది. ఇదే రోజు సాయంత్రం అధికారులు బరిలో నిలిచిన తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. ఇక అభ్యర్థులు డివిజన్లలో జోరుగా ప్రచారం నిర్వహించనున్నారు.
ఇవి కూడా చదవండి
ఏఎంఆర్పీ కాలువలో మునిగి బాలుడు మృతి.. సోదరుడు గల్లంతు
చిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ