హైదరాబాద్: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ (NEET) పరీక్ష షెడ్యూల్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. ప్రవేశ పరీక్షను జూలై 17న నిర్వహించనుంది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. మే 6వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించింది. ఈ పరీక్షను దేశవ్యాప్తంగా 543 నగరాల్లో, 13 భాషల్లో నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. తెలుగులో కూడా నీట్ పరీక్షను నిర్వహించనుంది. ఇప్పటివరకు ఉన్న వయోపరిమితిని ఎత్తివేసింది. గతంలో 25 ఏండ్ల లోపువారే నీట్ పరీక్ష రాసేందుకు అర్హులుగా ఉండేవారు. కాగా, ఓపెన్ స్కూల్లో, ప్రైవేటుగా 12వ తరగతి (ఇంటర్) ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకునే అవకాశం లేదని స్పష్టం చేసింది.
అప్లికేషన్ ఫీజు: రూ.1600, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ విద్యార్థులకు రూ.1500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జండర్లకు రూ.900, ఎన్ఆర్ఐ అభ్యర్థులకు రూ.8,500
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: మే 6
వెబ్సైట్: neet.nic.in
Application Process for NEET (UG) 2022 is now open. All the best. @EduMinOfIndia pic.twitter.com/fYibGc0JaB
— National Testing Agency (@DG_NTA) April 6, 2022