JEE Main | హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (జేఈఈ) -2 పరీక్షలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. దేశవ్యాప్తంగా ఈ నెల 6, 8, 10, 11, 12, 13, 15 తేదీల్లో ఎన్టీఏ నిర్వహిస్తుంది. ఐఐటీలు, ఎన్ఐటీ లు సహా ఇతర ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ పరీక్షలకు మొ త్తం 9.4 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో జరుగుతాయి. మొదటి సెషన్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్లో మ ధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఇక బీఆర్క్, బీ-ప్లానింగ్ ఎగ్జామ్ 3:30 గంటల పాటు నిర్వహిస్తారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు ఉంటాయి.
రాష్ట్రంలో పరీక్షలు జరిగే నగరాలివే..
రాష్ట్రంలో 16 పట్టణాల్లో పరీక్షలను నిర్వహిస్తారు. కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్లగొండ, వరంగల్, నిజామాబాద్, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, జగిత్యాల, జనగామ, కొత్తగూడెం, మేడ్చల్, సంగారెడ్డి, హైదరాబాద్, సికింద్రాబాద్లలోని పరీక్షాకేంద్రాల్లో పరీక్షలను నిర్వహిస్తారు.