న్యూఢిల్లీ: ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) సంస్కృతంలో సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించింది. ఈ సరికొత్త కోర్సును అభ్యసించాలనుకునేవారు ఈనెల 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ సర్టిఫికెట్ కోర్సు జూలై 2021 సెషన్ నుంచి అందుబాటులోకి రానుంది. ఇంటర్ పాసైనవారు ఈ కోర్సు అభ్యసించవచ్చని వెల్లడించింది. దీనికి ఆరు నెలల నుంచి ఏడాది కాలవ్యవధి ఉంటుంది. కాగా, ఇగ్నో ఇప్పటికే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ డ్రాయింగ్ అండ్ పెయింగ్ కోర్సును అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.
కోర్సుపేరు: సంస్కృతం
అర్హత: ఇంటర్ లేదా 12వ తరగతి పాసై ఉండాలి.
కోర్సు కాల వ్యవధి: ఆరు నుంచి 12 నెలలు
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.200
కోర్సు ఫీజు: రూ.1500
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 15
వెబ్సైట్: ignou.samarth.edu.in