Zomato | ప్రముఖ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ ‘జొమాటో (Zomato)’ తన కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నది. ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్లకు అంతగా ప్రాధాన్యం లేని రోజుల్లో ఆర్డర్లు చేసిన వెంటనే డెలివరీ అయ్యేవి. కానీ ఫుడ్ డెలివరీ యాప్స్ కు గిరాకీ పెరుగుతుండటంతో ఆర్డర్ కోసం కస్టమర్లు ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి వస్తున్నది. అందునా వారాంతంలో మరీ ఎక్కువ సేపు వేచి ఉండాల్సి వస్తున్నది.
ఈ నేపథ్యంలో కస్టమర్లకు ఫుడ్ ఆర్డర్లు మరింత వేగంగా అందుబాటులోకి తెచ్చేందుకు జొమాటో ‘ఫాస్ట్ డెలివరీ’ సేవలు ప్రారంభించనున్నది. ఈ ఫాస్ట్ డెలివరీ సేవల కింద ఫుడ్ ఆర్డర్ చేసిన వారు కొంత సొమ్ము అధికంగా పే చేయాల్సి ఉంటది. ఇప్పటికైతే ముంబై, బెంగళూరు నగరాల్లోని సెలెక్టెడ్ ప్రాంతాల్లో ఫాస్ట్ డెలివరీ ఫెసిలిటీ ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది జొమాటో. ముంబై, బెంగళూరు నగరాల్లోని సెలెక్టెడ్ రెస్టారెంట్లను ఈ ఫీచర్కు జత చేసింది.
యూజర్లు జొమాటో ప్లాట్ఫామ్లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నప్పుడే ఫాస్ట్ డెలివరీ ఫెసిలిటీని ఎంచుకోవచ్చు. ఈ ఆప్షన్ ఎంచుకున్న కస్టమర్లు అదనపు చార్జీలు పే చేయాల్సి ఉంటుంది. ఆర్డర్ బుక్ చేసిన 21 నిమిషాల్లో డెలివరీ చేస్తే రూ.29 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ముంబై, బెంగళూరు నగరాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ ఫెసిలిటీ విజయవంతమైతే దేశమంతా అమలవుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే ప్లాట్ ఫామ్ ఫీజు 25 శాతం పెంచింది. ప్రతి ఆర్డర్ మీద అదనంగా రూ.5 చెల్లించాల్సి ఉంటుంది. ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూరు, ముంబై, హైదరాబాద్, లక్నో నగరాల కస్టమర్లపై ప్రభావం చూపుతుంది.