సిద్దిపేట : ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావుకు ఎంతో ఇష్ట దైవమైన ఆలయంగా ప్రసిద్ధిగాంచిన కొనాయపల్లి పద్మావతి గోదా సమేత వేంకటేశ్వర స్వామి ఆలయ పునః ప్రతిష్ఠ మహోత్సవానికి మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. సోమవారం వేకువ జామునే మంత్రి పట్టు వస్త్రాలు ధరించి ఆలయానికి విచ్చేశారు.
పండుగ వాతావరణంలో జరిగిన ఆలయ పునః ప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా.. వేద పండితుల సమక్షంలో జరిగిన హోమ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వేంకటేశ్వర స్వామివారి గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.