కొన్ని సంస్థలు కొద్దిరోజులపాటు హైబ్రిడ్ విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించగా, మరికొన్ని సంస్థలు స్వచ్ఛందంగా వచ్చేవారు ఆఫీసులకు రావొచ్చనే అవకాశం కల్పిస్తున్నాయి. ఈ మేరకు విప్రో, కాగ్నిజెంట్, టీసీఎస్, ఇన్ఫోసిస్, గూగుల్ తదితర ప్రధాన కంపెనీలు ఇప్పటికే ఉద్యోగులకు మెయిల్స్ పంపించాయి.
హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): కొవిడ్ కారణంగా రెండేండ్లుగా వర్క్ ఫ్రమ్ హో మ్ కొనసాగిస్తున్న ఐటీ కంపెనీలు ఇప్పుడు మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో కార్యాలయాల తలుపులను తెరుస్తున్నాయి. ఇకపై వర్క్ ఫ్రమ్ హోం స్థానంలో.. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ విధానాన్ని కచ్చితంగా అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఐటీ ఉద్యోగులను ఆఫీసులకు పిలిచేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. దశలవారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ను పూర్తిస్థాయిలో ఎత్తివేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. కొన్ని సంస్థలు కొద్దిరోజులపాటు హైబ్రిడ్ విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించగా, మరికొన్ని సం స్థలు స్వచ్ఛందంగా వచ్చేవారు రావొచ్చనే అవకాశం కల్పిస్తున్నాయి. ఈ మేరకు విప్రో, కాగ్నిజెంట్, టీసీఎస్, ఇన్ఫోసిస్, గూగుల్ తదితర కంపెనీలు ఇప్పటికే ఉద్యోగులకు మెయిల్స్ పం పించాయి. పలు చిన్న కం పెనీలు ఈ నెల మొదటివారం నుంచే పూర్తిస్థాయిలో ఆఫీసుల నుంచి విధులు నిర్వహించాలని నిర్ణయించాయి.