IND vs ENG 3rd Test : మూడో టెస్టులో భారత్ కష్టాల్లో పడింది. తొలి సెషన్ మొదలైన కాసేపటికే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ విజృంభించడంతో ఓపెనర్ యశస్వీ జైస్వాల్(10)తో పాటు శుభ్మన్ గిల్(0) పెవిలియన్ చేరారు. పిచ్ బౌన్స్కు అనుకూలించడంతో వుడ్ నిప్పులు చెరిగాడు. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ బంతులతో యశస్వీ, గిల్ను బుట్టలో వేసుకున్నాడు.
Mark Wood draws Shubman’s edge, caught by Foakes for a duck #INDvENG
— ESPNcricinfo (@ESPNcricinfo) February 15, 2024
ఆ కాసేపటికే రజత్ పాటిదార్(5)ను టామ్ హర్ట్లే ఔట్ చేసి టీమిండియాను మరింత కష్టాల్లోకి నెట్టాడు. ప్రస్తుతం కెప్టెన్ రోహిత్ శర్మ(17), లోకల్ బాయ్ రవీంద్ర జడేజా(9) క్రీజులో ఉన్నారు. 9 ఓవర్లకు భారత్ మూడు వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది.