ఖమ్మం : ఖమ్మం(Khammam) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గుండెపోటు( Heart attack)తో ఆర్టీసీ బస్ డ్రైవర్(RTC drive) కన్నుమూశాడు. వివరాల్లోకి వెళ్తే.. సత్తుపల్లి నుంచి ఖమ్మం బయల్దేరిన బస్సులో డ్రైవర్ శ్రీనివాస్కు ఛాతిలో నొప్పి వచ్చింది. అయితే ఆయన ఆలస్యం చేయకుండా సమయస్ఫూర్తితో ప్రయాణికులతో ఉన్న బస్సును వెంటనే పక్కకు ఆపాడు. ఆ పై దగ్గరలోని దవాఖానకు వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాస్ మృతి చెందాడు. గుండెపోటుతో ఆయన కన్నుమూసినట్లు వైద్యులు ధృవీకరించారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును పక్కకు ఆపడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.