మహిళా సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలు తీసుకొచ్చి వారి పేరు మీదే ఇవ్వడంతో చిరకాలం గుర్తుంచుకుంటున్నారని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో ఆదివారం మహిళా బంధు సంబురాల్లో పాల్గొని మాట్లాడారు. దేశంలో ఏరాష్ట్రంలో లేని విధంగా పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అందిస్తున్నారని, ఇప్పటికే ఈ పథకం ద్వారా రూ.800 కోట్లు ఖర్చు చేశారని అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాతే మహిళలకు గౌరవం పెరిగిందని, మహిళల రక్షణకు సీఎం కేసీఆర్ షీటీమ్స్ ఏర్పాటు చేశారని తెలిపారు. రాష్ట్రంలో పెద్దసంఖ్యలో బాలికల గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేసి చదువులకు భరోసా కల్పించారని చెప్పారు. మహిళలకు ఉద్యోగ అవకాశాలతోపాటు రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. అన్నగా, తండ్రిగా, ఇంటికి పెద్దకొడుకుగా మహిళలను ఆదరించిన మహానేతకు రాఖీలు కట్టడం అద్భుతమైన ఘట్టమని మంత్రి అభివర్ణించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఊరూరా మహిళా బంధు సంబురాలు అట్టహాసంగా జరిగాయి. ఏడున్నరేండ్లలో చేపట్టిన కార్యక్రమాలను నలు దిశలా చాటేలా వేడుకలు నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పార్టీ శ్రేణులు ఉత్సాహంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లాలో సంబురాలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు చేసి, రాఖీలు కట్టి మహిళలు అభిమానాన్ని చాటుకున్నారు. ఉత్తమ మహిళా సర్పంచులు, ఎంపీటీసీలతో పాటు పారిశుధ్య కార్మికులు, వైద్య సిబ్బంది, అంగన్వాడీ వర్కర్లను ఘనంగా సన్మానించారు. చౌటుప్పల్లో నిర్వహించిన
మహిళా బంధు వేడుకల్లో మంత్రితోపాటు జడ్పీచైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి 105 మంది లబ్ధ్దిదారులకు రూ.కోటీ ఐదు లక్షల కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. భువనగిరిలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, మోత్కూరు మండలంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం నియోజకవర్గ స్థాయిల్లో నిర్వహించే సమావేశాలు, సంబురాల కోసం టీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి.
చౌటుప్పల్, మార్చి 6 : మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్ను మహిళా చిరకాలం గుర్తుంచుకుంటారని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అనేక పథకాలతో ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. చౌటుప్పల్లోని ఎస్ఎంఆర్ ఫంక్షన్హాల్లో ఆదివారం నిర్వహించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై 105 మంది లబ్ధిదారులకు చెక్కులను, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సమకూర్చిన వస్ర్తాలను పంపిణీ చేశారు. అంతకు ముందు మహిళా దినోత్సవం సందర్భంగా పలువురు అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, మహిళా కౌన్సిలర్లు, సర్పంచులను మంత్రి పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఎదిగిన ఆడబిడ్డను తల్లిదండ్రులు కుంపటిలా భావించేవారని, ఆడపిల్లల వివాహానికి అప్పులు చేసి తిప్పలు పడేవారని గుర్తుచేశారు. ఆడపిల్లల తల్లిదండ్రుల బాధలను గమనించి చలించిన సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను తీసుకువచ్చి ఆర్థిక భరోసా కల్పించారని తెలిపారు. ఇప్పటికే ఈ పథకం కింద రూ.800 కోట్లు ఖర్చు చేశారని వెల్లడించారు. మహిళల భద్రత, సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. మహిళలను వేధిస్తున్న కీచకుల ఆట కట్టించేందుకు షీ టీమ్స్కు సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారని గుర్తు చేశారు.
మహిళలు చదువుకున్నప్పడే అన్ని రంగాల్లో రాణిస్తారని గ్రహించిన సీఎం.. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బాలికల గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేశారని, దేశంలో ఎక్కువ డిగ్రీ కళాశాలలున్న రాష్ట్రం తెలంగాణనేనని తెలిపారు. మహిళలు బాగుంటేనే ఆ కుటుంబం పచ్చగా ఉంటుందని, వారి పేరుతోనే రేషన్కార్డులు, పలు పథకాలు అమలవుతున్నాయని వివరించారు. సమావేశంలో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, మాజీ ఎంపీ డా.బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు, ఎంపీపీ తాడూరి వెంకట్రెడ్డి, మార్కెట్ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ చింతల దామోదర్రెడ్డి, టీఆర్ఎస్ మున్సిపాలిటీ, మండలాధ్యక్షులు ముత్యాల ప్రభాకర్రెడ్డి, గిర్కటి నిరంజన్గౌడ్, ప్రధాన కార్యదర్శులు గుండెబోయిన వెంకటేశ్యాదవ్, ఢిల్లీ మాధవరెడ్డి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు కొత్త పర్వతాలు యాదవ్, టీఆర్ఎస్ యువజన విభాగం మున్సిపాలిటీ, మండలాధ్యక్షులు తొర్పునూరి నర్సింహాగౌడ్, నారెడ్డి అభినందన్రెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్న సీఎం కేసీఆర్కు తామంతా అండగా ఉన్నామని తెలియజెప్పేలా రాష్ట్రంలోని అన్ని గ్రామాల మహిళలు సీఎం కేసీఆర్ ఫొటోలు, ఫ్లెక్సీలకు రాఖీలు కడుతున్నారని మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. మున్సిపాలిటీ కేంద్రంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి మహిళలు రాఖీలు కట్టగా మంత్రి పాల్గొని మాట్లాడారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.