వికారాబాద్ : ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ మహిళ మృతి చెందిన సంఘటన వికారాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఈసంఘటనకు సంబంధించి ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
వికారాబాద్ జిల్లా కేంద్రం ఎడ్లబజార్కు చెందిన తుడుము యాదమ్మ (45) వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నది. ఆదివారం తల్లి దాసరి అనంతమ్మతో కలసి వికారాబాద్ మున్సిపల పరిధిలోని ధన్నారం వెళ్లే రోడ్డులో ఉన్న చర్చి వద్ద రాజేశ్వర్ వ్యవసాయ పొలంలో వ్యవసాయ కూలీ పనులకు వెళ్లింది. ఈ క్రమంలో నీళ్లు తాగడానికి బావిలో దిగి ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడి యాదమ్మ మృతిచెందింది. మృతురాలి కొడుకు శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దార్యప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు.