కాచిగూడ,ఏప్రిల్ 28 : పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మహిళ మృతి చెందింది. కాచిగూడ రైల్వే హెడ్కానిస్టేబుల్ సమ్మయ్య వివరాల ప్రకారం.. గుర్తుతెలియని వృద్ధురాలు(70)మంగళవారం మలక్పేట-డబీర్పుర రైల్వేస్టేషన్ల మధ్య పట్టాలు దాటుతుండగా కర్ణాటక సంపర్క్క్రాంతి ఎక్స్ప్రెస్ రైలు ఢీకొనడంతో ఆ వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని ఉస్మానియా దవాఖానకు తరలించారు. వృద్ధురాలి ఒంటిపై ఆకుపచ్చ చీర, వంకాయ రంగు జాకెట్ ధరించి, ఎత్తు 5.2 ఉన్నట్లు తెలిపారు. వివరాలకు 8712658584లో సంప్రదించాలని కోరారు. కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే కానిస్టేబుల్ తెలిపారు.