న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో శనివారం 30 స్థానాలకు జరిగిన తొలి విడత ఎన్నికల్లో 26 సీట్లలో గెలుపు బీజేపీదేనని అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బూత్ స్థాయి కార్యకర్తలతో సంప్రదించిన తర్వాతే తాను ఈ విషయం చెబుతున్నట్లు ఆయన చెప్పారు. ఇక అటు అస్సాంలో తొలి విడతలో భాగంగా 47 సీట్లకు జరిగిన ఎన్నికల్లో 37 స్థానాల్లో గెలుస్తామని స్పష్టం చేశారు. చాలా ఏళ్ల తర్వాత పశ్చిమ బెంగాల్లో ఎలాంటి హింస లేకుండా పోలింగ్ జరిగిందని ఆయన అన్నారు. బీజేపీకి ఓట్లు వేసినందుకు మహిళలకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు అమిత్ షా చెప్పారు. 200కుపైగా సీట్లతో పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన తేల్చి చెప్పారు.
ఆ ఫోన్ ట్యాప్ ఎవరు చేశారు?
బీజేపీ నేత ముకుల్ రాయ్ ఫోన్ కాల్ను ఎవరు ట్యాప్ చేశారో తాను తెలుసుకోవాలని అనుకుంటున్నట్లు అమిత్ షా ఈ సందర్భంగా చెప్పారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తాను ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయగలనని ముకుల్ రాయ్ చెప్పినట్లు ఆ కాల్లో స్పష్టంగా ఉంది. దీనిపై స్పందించిన అమిత్ షా.. అధికారుల బదిలీకి సంబంధించిన డిమాండ్లు ఆ ఫోన్ కాల్లో ఉన్నాయని చెప్పారు. ఈ డిమాండ్లను లిఖితపూర్వకంగానే ఇచ్చామని, ఇందులో రహస్యమేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. అసలు ప్రశ్న ఇది కాదని, అసలు ఫోన్ కాల్ను ఎవరు ట్యాప్ చేశారో తెలియాలని ఆయన అన్నారు.
ఇవికూడా చదవండి..
100 కోట్లు ఇవ్వండి.. కేంద్రాన్ని కోరిన భారత్ బయోటెక్, సీరమ్
సుయెజ్ కాలువలో ఇరుక్కున్న ఎవర్గివెన్ షిప్ కాస్త కదిలింది
ప్రపంచంలో సెక్సీయెస్ట్ బాల్డ్ మ్యాన్.. ప్రిన్స్ విలియమ్
నాపై రిటైర్డ్ జడ్జి విచారణ జరుపుతారు: అనిల్ దేశ్ముఖ్
ఆండ్రాయిడ్ యూజర్లూ.. సిస్టమ్ అప్డేట్తో జాగ్రత్త
కోహ్లి అడిగాడు.. సాఫ్ట్ సిగ్నల్కు నో చెప్పిన బీసీసీఐ
ఎన్నికల సిత్రాలు.. దాండియా ఆడిన కేంద్ర మంత్రి
నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి