Congress | హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని కమ్మ కులస్థులు కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలో చెప్పాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కమ్మకుల సమాజం పేరిట సీఎం రేవంత్రెడ్డికి రాసిన లేఖ ఒకటి సోషల్ మీడియా వైరల్ అవుతున్నది. కాంగ్రెస్కు ఓటెందుకు వేయాలో ఒక్క కారణమైనా చెప్పే దమ్ము రేవంత్కు ఉందా? అని అందులో ప్రశ్నించారు. కమ్మకులస్థులు అధికంగా ఉండే ఖమ్మం, చేవెళ్ల, మల్కాజిగిరిలో టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్కు ఒక్క అభ్యర్థి కూడా దొరకలేదా? అని నిలదీశారు.
‘తెలంగాణలో ఆర్థికంగా, సామాజికంగా కమ్మలు అత్యంత ప్రభావిత వర్గమని మీరు భావించట్లేదా? మీ రాజకీయ ఉన్నతికి పునాది వేసింది కమ్మ కులస్థులు కాదా?’ అని సూటిగా ప్రశ్నించారు. నాడు నారా చంద్రబాబునాయుడు చలువతో రేవంత్రెడ్డి కమ్మలను వాడుకొని ఈ స్థితికి వచ్చారని గుర్తుచేశారు. ‘ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, కమ్మ మీడియా సంస్థల దన్నుతో మీరు ఒక బలమైన నాయకుడిగా ఎదిగింది వాస్తవం కాదా? నువ్వు పీసీసీ అధ్యక్షుడైతే అక్కు న చేర్చుకుంది మా నాయకురాలు రేణుకాచౌదరి కాదా? అని లేఖలో ప్రశ్నించారు.
ఒక్క కమ్మ అభ్యర్థీ దొరకలేదా?
‘తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో 37 అసెంబ్లీ నియోజకవర్గాలను కమ్మ కులం ప్రభావితం చేస్తుందనే విషయం మీకు తెలియదా? లేదా, తెలిసి నటిస్తున్నారా? గత అసెంబ్లీ ఎన్నికల్లో కమ్మ కులస్థులు గంపగుత్తగా కాంగ్రెస్కే ఓటువేసిన విషయం మర్చిపోయారా? ఆ దన్నుతోనే మీరు సీఎం అయిన వాస్తవాన్ని అటకెక్కించారా?’ అని ప్రశ్నించారు.
‘ఎన్నికలు కాగానే నీ కులానికి మూడు మంత్రి పదవులు, 14 కార్పొరేషన్లు, 17 మంది అధికారులకు అత్యంత కీలక పోస్టులు ఇచ్చుకున్నావు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కమ్మలకు అత్యంత బలమైనదనే విషయం మీకు తెలియదా? ఎంపీ ఎన్నికల్లో నీ రెడ్డి కులానికి 17 సీట్లలో ఏడు సీట్లను కేటాయించి నీ కుల పక్షపాతాన్ని నిరూపించుకున్నది వాస్తవం కాదా? రాష్ట్రంలో ఎంపీగా నిలబడేందుకు కమ్మ అభ్యర్థి లేరా? కమ్మలు ఎంపీ సీటుకు అర్హులు కారా?’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్కు ఈసారి గోరీ కడతం
‘ఖమ్మం, చేవెళ్ల, మలాజిగిరి లాంటి ఒక స్థానంలో కూడా పోటీకి కమ్మం కులం నుంచి అభ్యర్థులు దొరకలేదా? లేదా నీ కుల పెత్తనాన్ని మా మీద రుద్దాలని నిర్ణయం తీసుకున్నావా? నీ కులానికి చెందిన నీ శత్రువు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడే కాకుండా నటుడు దగ్గుబాటి వెంకటేశ్ వియ్యంకుడు అయిన రఘురాంరెడ్డికి ఖమ్మం ఎంపీ సీటు ఇవ్వడానికి ఇష్టపడ్డావు కానీ, నీకు రాజకీయంగా, వ్యక్తిగతంగా ఔన్నత్యాన్ని ఇచ్చిన కమ్మ కులాన్ని పకన పెట్టడాన్ని మా కులం జీర్ణించుకోలేకపోతున్నది.
రాష్ట్రంలో బలమైన ఓటు బ్యాంకు, ఆర్థిక పునాదులు కలిగిన మా కమ్మ కులం రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలో ఒకసారి పబ్లిక్ గా చెప్పే దమ్ము నీకు ఉందా? వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గోరీ కట్టడమే మా ఆశయం అని తెలుసుకో రేవంత్రెడ్డి. జై కమ్మ.. జై ఎన్టీఆర్’ అంటూ లేఖను ముగించారు.