పీర్జాదిగూడ, నవంబర్ 12 : విద్యార్థులు చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని మేడిపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం పాఠశాలలో నిర్వహించిన బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించి అందరిని ఆకట్టుకున్నారు. కృషి, పట్టుదల, క్రమశిక్షణ ఉంటే జీవితంలో సాధించలేనిది ఏదీ ఉండదని ప్రధానోపాధ్యాయులు ప్రసాద్ విద్యార్థులకు సూచించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.