మెదక్ : రజకుల కోసం తెలంగాణలోని 33 జిల్లాల్లో రెండేసి కోట్లతో మాడ్రన్ ధోబీఘాట్లు నిర్మిస్తాం. వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూ ర్తితో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి సాధించించారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం మెదక్ పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన రజకుల ఆత్మగౌరవ సభలో మంత్రి హరీశ్ రావు మాట్లాడారు.
దక్షిణ భారత దేశంలోనే స్వచ్ఛ భారత్ సృష్టి కర్త సంత్ గాడ్గే బాబా విగ్రహాన్ని మెదక్లో ఏర్పాటు చేశామని, కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్లు దేశంలో ఎక్కడా లేవన్నారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి రూ.3 లక్షలతో సొంతింటి జాగాలో ఇండ్ల నిర్మాణం కార్యక్రమాన్ని చేపడుతామన్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం కొనసాగుతూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. వృత్తి పైనా ఆధారపడ్డ రజకులకు, నాయీ బ్రాహ్మణులకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. 80 శాతం సబ్సిడీతో రజకులకు సబ్సిడీ లోన్లు మంజూరు చేస్తామన్నారు. మెదక్లో రజకుల కమ్యూనిటీ హాల్ కోసం రెండు ఎకరాలు కేటాయించాం.
కోటి రూపాయలతో జిల్లా కేంద్రంలో ఫంక్షన్ హాల్, రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే విషయంపై సీఎం కేసీఆర్ తో మాట్లాడుతానని హామీనిచ్చారు. మెదక్ పట్టణానికి 500 పడకల హాస్పిటల్ను నెలకొల్పుతాం. మెదక్ కు మెడికల్ కాలేజీతో పాటు నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. 60 ఏండ్ల కాంగ్రెస్, టిడిపి పాలనలో మూడే మెడికల్ కాలేజీలు వచ్చాయి. అరేండ్ల లో తెలంగాణలో 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.