హైదరాబాద్ : సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటయ్యే వరకు ఉద్యమిస్తాం అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం శాంతియుతంగా ర్యాలీ చేస్తామంటే చేసుకోమన్న పోలీసులు ముందు రోజు రాత్రి అనుమతి నిరాకరించారన్నారు. ర్యాలీకి రాకుండా అడుగడుగునా అడ్డుకున్నారని ఆరోపించారు. భయానక వాతావరణం సృష్టించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా మన నిరసన తెలపడంలో విజయవంతం అయ్యామన్నారు.
220 సంవత్సరాల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ మన అస్తిత్వం, ఆత్మగౌరవం. సికింద్రాబాద్ కార్పోరేషన్ ఏర్పాటు విషయంలో ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. న్యాయస్థానం నుండి అనుమతి పొంది ఫిబ్రవరి మొదటి వారంలో వేలాదిమంది తో ర్యాలీ నిర్వహిస్తాం. ఇదే స్ఫూర్తితో పోరాటం కొనసాగిద్దాం అన్నారు. ఆందోళనకు మద్దతు తెలిపిన పార్టీ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.