న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఇండియాకు వస్తున్న అందరికీ ముందు జాగ్రత్తగా ఉచితంగా పోలియో వ్యాక్సిన్ ( Polio Vaccination ) వేయనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆదివారం చెప్పారు. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండైన వారికి వ్యాక్సిన్లు ఇస్తున్న ఫొటోను కూడా ఆయన షేర్ చేశారు. ప్రపంచంలో ఇప్పటికీ ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్లలో మాత్రమే పోలియో జాడలు ఉన్నాయి. అందుకే ఆఫ్ఘనిస్థాన్ నుంచి వస్తున్న అందరికీ ముందు జాగ్రత్తగా ఓపీవీ & ఎఫ్ఐపీవీ పోలియో వ్యాక్సిన్ ఇస్తున్నట్లు మాండవీయ ట్వీట్ చేశారు. ఆదివారం కాబూల్ నుంచి మరో 168 మందిని సురక్షితంగా ఇండియాకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వీళ్లలో 107 మంది భారతీయులు ఉన్నారు.