KTR | తెలంగాణలో జూన్ 25 నుండి SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ను తీసుకొస్తున్నారు.. మనం జాగ్రత్తగా ఉండాలని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వేములవాడ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా SIRపై అవగాహనా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. SIR చాలా ముఖ్యమైన కార్యక్రమం.. మీ అందరికీ ఇచ్చిన కాగితాల్లో చాలా ముఖ్యమైన సమాచారం ఉన్నది. చదువండి.. అర్థం చేసుకోండని సూచించారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) తేవడంతో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోయారు. 95 లక్షల ఓట్లు అక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసేసిందన్నారు. బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ గెలుస్తదని అనుకున్నాం.. కానీ ఆ పార్టీ ఓడిపోయిందన్నారు కేటీఆర్. తమిళనాడులో స్టాలిన్ ఓడిపోయారు. ఆయన సొంత నియోజకవర్గంలో 80 వేల ఓట్లు తొలగించారు.. ఆయన 10-15 వేల ఓట్లతో ఓడిపోయారన్నారు.
బీహార్లో, పశ్చిమ బెంగాల్లో మాకు పడయ్ అనుకున్న ఓట్లు కొన్ని కట్ చేసిర్రు అని వార్తలొస్తున్నాయి. బెంగాల్లో ఈ రోజు ఈ నిమిషానికి 27 లక్షల మంది మాకు ఓటు హక్కు ఉంది కానీ మమ్మల్ని తొలగించారని వారు కోర్టులో కేసు వేశారు.. ఇంకా నడుస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. కోర్టులో నడుస్తూనే ఉన్నది.. ఇక్కడ ఎన్నికలు అయిపోయాయి. మమతా బెనర్జీ దిగిపోయింది.. ఆగమాగం అయితనే ఉన్నదన్నారు. అందుకో ముఖ్యమైంది ఒక్కొక్క ఓటు మనం జాగ్రత్తగా చూసుకుంటే మనకా పరిస్థితి తప్పుతదనే ఉద్దేశంతో మీకు ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) తెచ్చి వెస్ట్ బెంగాల్లో 95 లక్షల ఓట్లు, బీహార్లో 65 లక్షల ఓట్లు తీసేశారు
తమిళనాడులో మాజీ సీఎం స్టాలిన్ సొంత నియోజకవర్గంలో 80 వేల ఓట్లు తొలగించారు.. ఆయన 10 వేల ఓట్లతో ఓడిపోయాడు
తెలంగాణలో జూన్ 25 నుండి SIRను తీసుకొస్తున్నారు.. మనం జాగ్రత్తగా… pic.twitter.com/4QmXSIZelA
— Telugu Scribe (@TeluguScribe) June 13, 2026
SIR జరిగిన ప్రాంతాల్లో బీజేపీ వాళ్లకు పడవన్న ఓట్లు అన్ని తొలగించారు
27 లక్షల మంది మాకు ఓటు హక్కు ఉంది కానీ మమ్మల్ని తొలగించారని కోర్టులో కేసు వేశారు
– కేటీఆర్ https://t.co/YF94jRCXi5 pic.twitter.com/5hHCmjUVsd
— Telugu Scribe (@TeluguScribe) June 13, 2026