వెంకటాపూర్, జూలై 17: మండలంలోని పాలంపేట రామప్ప దేవాలయం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. వేలాది మంది భక్తులు సందర్శించారు. ఆలయంలోని రామలింగేశ్వరుడికి పూజలు చేశారు. ఆలయ అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్ తీర్థప్రసాదాలు ఆలయంలో ఫొటోలు, సెల్ఫీలు దిగారు. రామప్ప సరస్సును సందర్శించి బోటింగ్ చేశారు. కాగా, ఆలయాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు శక్తికాంత్ సింగ్ ఐఎఫ్ఎస్, అన్సాల్ సుతార్, కిరణ్మాలీ సందర్శించారు. అర్చకులు స్వాగతం పలికి ప్రత్యేక పూజల తర్వాత తీర్థ ప్రసాదాలు అందించి శాలువాలతో సన్మానించారు. ఆలయ చరిత్రను టూరిజం గైడ్ ద్వారా తెలుసుకొని, ఇంత అద్భుత శిల్పాలు నాటి కళాకారుల పనితీరుకు నిదర్శనం అన్నారు. భూపాలపల్లి అడిషనల్ డీఆర్డీవో అంజయ్య, ఆర్ఐ ఉన్నారు.