Polling Percent | దేశంలో సార్వత్రిక ఎన్నికలకు (Lok Sabha Elections) తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కాగా.. సాయంత్రం 6 గంటలవరకూ కొనసాగనుంది. దీంతో సాధారణ పౌరులతోపాటు ప్రముఖులు కూడా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు తరలివెళ్లి అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
ఇక మధ్యాహ్నం 1 గంట వరకూ త్రిపుర (Tripura) రాష్ట్రంలో అత్యధిక శాతం పోలింగ్ నమోదైంది (Polling Percent). ఆ రాష్ట్రంలో 53.04 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇక అత్యల్పంగా లక్షద్వీప్లో (Lakshadweep) 29.91 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపింది.
#LokSabhaElections2024 | Voter turnout till 1 pm for phase 1 of polling:
Lakshadweep records the lowest – 29.91%
Tripura records the highest – 53.04% pic.twitter.com/Pd03IigQ0K— ANI (@ANI) April 19, 2024
Also Read..
Manipur | మణిపూర్లో పోలింగ్ కేంద్రం వద్ద కాల్పుల కలకలం.. భయంతో పరుగులు తీసిన ఓటర్లు
Lok Sabha Elections | ముందుగా నేనే ఓటేయాలనుకున్నా.. కానీ ఓటర్లను చూసి షాకయ్యా : మేఘాలయా సీఎం
Arvind Kejriwal | నాకు జైల్లో ఇంజక్షన్లు ఇవ్వండి.. కోర్టును ఆశ్రయించిన అరవింద్ కేజ్రీవాల్