టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్ల ఫామ్ అందుకోవడం భారత క్రికెట్ అభిమానులను ఆనందంలో ముంచేస్తోంది. ఆసియా కప్లో అద్భుతంగా ఆడిన కోహ్లీ.. ఆస్ట్రేలియా సిరీస్లో కూడా అదే జోర చూపిస్తాడని అంతా అనుకున్నారు. కానీ తొలి రెండు మ్యాచుల్లో విఫలమైన అతను.. 2, 11 స్కోర్లు మాత్రమే నమోదు చేశాడు.
అయితే కీలకమైన మూడో మ్యాచ్లో మాత్రం తన సత్తా ఏంటో చూపించాడు. రాహుల్, రోహిత్ వెంట వెంటనే పెవిలియన్ చేరడంతో మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడిన అతను.. సూర్యకుమార్ యాదవ్కు మంచి సహకారం అందించాడు. అతని అండతో రెచ్చిపోయిన సూర్య భారత్ను దాదాపు గెలుపు ఒడికి చేర్చాడు.
అతను అవుటైన తర్వాత కోహ్లీ, పాండ్యా ఇద్దరూ భారీ షాట్లు ఆడేందుకు ఇబ్బంది పడ్డారు. ఇలాంటి సమయంలో చివరి ఓవర్ తొలి బంతికి సిక్సర్ బాదిన కోహ్లీ.. భారత్ విజయాన్ని ఖాయం చేశాడు. ఇదే విషయాన్ని ఎత్తిచూపిన పాక్ మాజీ సారధి సల్మాన్ బట్.. ‘ఒక్కో మ్యాచ్ జరిగేకొద్దీ కోహ్లీ ఆటతీరు మెరుగవుతోంది. బలమైన ఆస్ట్రేలియాతో, తీవ్రమైన ఒత్తిడి ఉన్న మ్యాచ్లో, అదీ తొలి రెండు మ్యాచుల వైఫల్యం భారాన్ని మోస్తూ అతను ఆడిన తీరు అద్భుతం’ అని కొనియాడాడు.
అదే సమయంలో గతంలో చాలాసార్లు తనను అవుట్ చేసిన ఆడమ్ జంపాను కోహ్లీ ఎదుర్కొన్న విధానాన్ని కూడా బట్ మెచ్చుకున్నాడు. జంపా బౌలింగ్లో పూర్తి ఎగ్రెసివ్గా ఆడిన కోహ్లీ ఎదురుదాడికి దిగాడు. కోహ్లీ.. ఒక ఛాంపియన్లా జంపాను ఎదుర్కొన్నాడని బట్ కితాబిచ్చాడు. కోహ్లీ ఇలా ఫామ్లోకి రావడం భారత క్రికెట్కు సానుకూలాంశమని, అది కూడా ప్రపంచకప్ ముందు అతను ఇలా ఆడటం చాలా కీలకమని అన్నాడు.
మిడిలార్డర్లో సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా వంటి ఆటగాళ్లు ఉన్నారు కాబట్టి కోహ్లీ రెచ్చిపోవాల్సిన అవసరం లేదని, చివరి వరకు క్రీజులో ఉండటానికి ప్రయత్నిస్తే సరిపోతుందని వివరించాడు. తీవ్రమైన ఒత్తిడిలో కోహ్లీ అద్భుతంగా ఆడుతున్నాడని, ఆసీస్తో జరిగిన మూడో టీ20లో చివరి ఓవర్ తొలి బంతికి అతను బాదిన సిక్సరే దానికి ఉదాహరణ అని స్పష్టం చేశాడు.