15 భవనాల నిర్మాణానికి రూ.2 కోట్ల 40 లక్షలు మంజూరు
త్వరలో పనులు ప్రారంభం
మేడ్చల్, డిసెంబర్ 25(నమస్తే తెలంగాణ): పల్లె దవాఖానల పక్కా భవనాల నిర్మాణాలకు టెండర్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 35 పల్లె దవాఖానల ఏర్పాటులో భాగంగా 15 పక్కా భవనాల నిర్మాణాలకు రూ.2 కోట్ల 40 లక్షల నిధులు మంజూరయ్యాయి. దీంతో టెండర్ల పక్రి య పూర్తితో త్వరలోనే పనులను ప్రారంభించనున్నారు. ఒక్క పల్లె దవాఖాన పక్కా భవన నిర్మాణానికి గాను రూ.16 లక్షల నిధులతో నిర్మాణం చేపట్టానున్నారు. పల్లె దవాఖానలకు స్థలాలను రెవెన్యూ అధికారులు కేటాయించగా, పక్కా భవనాలను నిర్మించనున్నారు. వైద్య సేవలను సౌకర్యవంతంగా అందించేందుకు పక్కా భవనాలను నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికి జిల్లాలోని జవహర్నగర్ పరిధిలోని అంబేద్కర్నగర్, బాలాజీనగర్, కీసర, జగన్గూడ, లా ల్గడి మలక్పేట్, బోగారం, చేర్యాల్, ఎదులాబాద్, ఉద్దమర్రి, కేశవాపూ ర్, అలియాబాద్, తుర్కపల్లి, డబీల్పూర్, పుడూర్, రావల్కల్లో పక్కా భవనాల నిర్మాణాలను టెండర్లు పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు.
మిగతా వాటికి త్వరలోనే స్థలాలు..
మరో 20 పల్లె దవాఖానల పక్కా భవనాల నిర్మాణాలకు సంబంధించి స్థలాలను త్వరలోనే ఎంపిక చేయనున్నారు. పల్లె దవాఖానలు ఏర్పాటు చేసిన ప్రాంతాలలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వ స్థలాలను ఎంపిక చేసి వైద్యశాఖకు అప్పగించనున్నారు. సుమారు 200 గజాల నుంచి 3 వందల గజాల స్థలాలు ఉండే విధంగా అధికారులు చూస్తున్నారు. బస్తీ దవాఖానలలో ప్రస్తుతం అందిస్తున్న వైద్య సేవలన్నింటినీ పల్లె దవాఖానలలో అందించనున్నారు.
15 భవన నిర్మాణాలకు టెండర్లు పూర్తి..
మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా మొదటి దశలో 15 పల్లె దవాఖానల పక్కా భవనాల నిర్మాణాలకు టెండర్లు పూర్తయ్యాయి. పక్కా భవన నిర్మాణాలకు రూ.2 కోట్ల 40 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఒక్క పల్లె దవాఖాన నిర్మాణనికి గాను రూ.16 లక్షలను వెచ్చిస్తున్నాం. వైద్య సేవలకు అనుగుణంగా భవనాలను నిర్మించనున్నారు.