హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికలకు(Parliament elections) అధికారులు ఏర్పాట్లు ముమ్మురం చేస్తున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్(Postal ballot polling) సరళిని సోమవారం అబిడ్స్లోని( Abids) ఆల్ సెయింట్ హైస్కూల్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్(Vikas Raj) పరిశీలించారు. పోలింగ్ రిజిస్ట్రేషన్, ఓటర్ల రిజిస్ట్రేషన్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఓటింగ్ సరళి వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ను పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతగా జరిగేలా చూడాలని, ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఏవైనా సందేహాలుంటే ఉన్నతాధికారులను సంప్రదించాలని సూచించారు.