కొడంగల్, నవంబర్ 11: రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసే దిశగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని పీఏసీఎస్ అధ్యక్షుడు కటకం శివకుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భీములు తెలిపారు. గురువారం పట్టణంలోని మార్కెట్ యార్డ్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమి టీ వైస్ చైర్మన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడు తూ కరోనా కాలంలో కూడా రైతు పండించి ప్రతి గింజను కొనుగోలు చేసినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఏ రకం ధాన్యానికి రూ.1960, బీ రకం ధాన్యానికి 1940 గిట్టుబాటు ధరలు కల్పించినట్లు తెలిపారు. రైతు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించే ముందే పూర్తి స్థాయిలో ఎండబెట్టాలని, చెత్తా చెదారం లే కుండా శుభ్రంచేసుకొని రావాలని తెలిపారు. అప్పుడే ధాన్యం కొనుగోలుతో పాటు గిట్టుబాటు ధర పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. పట్టాదార్ పాస్బుక్, బ్యాంకు ఖాతా పాస్బుక్, ఆధార్కార్డుల జిరాక్స్లతో పాటు సంబంధిత అధికారుల ధ్రువీకరణ పత్రాలు తప్పక తీసుకొని రావాల్సి ఉంటుందని తెలిపారు. అదేవిధంగా ఓటీపీ ప్రకారం ధాన్యం కొనుగోలు చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ అధికార ప్రతినిధి టీటీ రాములు, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు బస్వరాజ్తో పాటు డైరెక్టర్లు ఏన్గుల భాస్కర్, శ్రీనివాస్గౌడ్, భీం శంకర్, మార్కెట్ కమిటీ సూపర్ వైజర్ దేవదత్తుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలుపై రైతులకు అవగాహన
కులకచర్ల, నవంబర్ 11 : రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రంలో అమ్మిన ధాన్యానికి డబ్బులు రావాలంటే రైతులు తమ ఆధార్ కార్డులకు మొబైల్ నంబర్ను లింక్ చేయాలని కులకచర్ల ఏపీఎం శోభ అన్నా రు. గురువారం కులకచర్ల మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ సౌమ్యావెంకట్రాంరెడ్డి అధ్యక్షతన రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సీసీ వెంకటయ్య, గ్రామ రైతులు పాల్గొన్నారు.