న్యూఢిల్లీ : అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతితో మమేకమై జీవించడం నేటి పరిస్థితుల్లో మరింత ఆవశ్యకమన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవడడం మనందరి బాధ్యత అన్నారు. సుస్థిర వ్యవసాయ విధానాలను అమలు పరుస్తూ.. అటవీకరణను ప్రోత్సహించడంతో పాటు సముద్ర కాలుష్యాన్ని అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణానుకూల జీవన విధానాలను పాటిస్తూ, కర్బన ఉద్గారాలను వీలైనంత మేర తగ్గించుకోవడంపైనా మనమంతా దృష్టిపెట్టాల్సిన అవసరముందని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా భవిష్యత్ తరాలకు జీవనానుకూల వాతావరణాన్ని అందించేందుకు మనమంతా కంకణబద్ధులవుదామని పిలుపునిచ్చారు.