హైదరాబాద్ : సికింద్రాబాద్లోని(Secunderabad) ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని(Mahankali temple) కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్(Rajnath Singh) శుక్రవారం దర్శించుకున్నారు. మెహబూబ్ కాలేజీలో సికింద్రాబాద్ నియోజకవర్గ విజయ సంకల్ప సభలో పాల్గొనేందుకు నగరానికి చేరుకున్న ఆయన ముందుగా అమ్మవారి ఆలయంలో పూజల్లో పాల్గొన్నారు. అనంతరం మహంకాళి దేవస్థానం నుంచి మెహబూబ్ కాలేజీ వరకు నిర్వహించిన ర్యాలీగా బయల్దేరారు. ఆయన వెంట మంత్రి కిషన్ రెడ్డి, తదితరులు ఉన్నారు.