మొయినాబాద్ : మోదీ పాలనలో నిరుద్యోగం పెరగిందని, కార్మికుల చట్టాలు, హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తున్నదని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామస్వామి అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయం వద్ద మేడే వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేడేను జరుపుకోబట్టి 138 సంవత్సరాలుగా జరుపుకొంటున్న కూడా కార్మికుల జీవితాల్లో వెలుగులు మాత్రం రాలేదన్నారు. దేశంలోని 44 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు తాకట్టుపెట్టిందని విమర్శించారు. ఎన్నికల్లో బీజేపీకి కార్మికులు తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. మేడేను విజయవంతం చేయడానికి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి కె శ్రీనివాస్, ఏఐటీయూసీ మండల కార్యదర్శి బోనాల ప్రభాకర్, ఏఐటీయూసీ చేవెళ్ల మండల సహాయ కార్యదర్శి ఎండీ మక్బుల్, మహిళా సంఘం అధ్యక్షురాలు వడ్ల మంజుల, నాయకులు ఎం వెంకటయ్య, ఎం నర్సింహులు, ఎం రాములు తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్లటౌన్ : మే డేను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రామస్వామి, జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ తెలిపారు. 138వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా గురువారం మండల కేంద్రంలో కార్మికులతో కలిసి వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కార్మికులు ఎనిమిది గంటల పనిని సాధించుకున్న రోజే మే డే అని తెలిపారు. మే డేను కార్మికులు, కర్షకులు, రైతులు అందరూ కలిసి ఘనంగా జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీకేఎంయూ జిల్లా అధ్యక్షుడు అంజయ్య, ఏఐటీయూసీ మండల ప్రధాన కార్యదర్శి డప్పు శివయ్య, సీపీఐ మండల సహాయ కార్యదర్శి ఎండీ మక్బుల్, మహిళా సంఘం మండల అధ్యక్షురాలు వడ్ల మంజుల, గీత పనివాళ్ల సంఘం మండల అధ్యక్షుడు కృష్ణగౌడ్, ఒగ్గు సత్యనారాయణ,, మురళి, లలిత, వెంకటమ్మ, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.