చెన్నై : ప్రధాని నరేంద్ర మోదీకి డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చురకలంటించారు. నిన్న ప్రధాని మోదీ తమిళనాడులోని అవినాసి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తూ.. ఉదయనిధి కోసం డీఎంకే సీనియర్లను ఆయన తండ్రి స్టాలిన్ పక్కన పెట్టారని ఆరోపించారు. తండ్రి మద్దతుతో ఉదయనిధి ఎన్నికల బరిలో నిలిచారని ప్రధాని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై ఉదయనిధి తీవ్రంగా స్పందించారు. ప్రధానమంత్రి అయ్యేందుకు బీజేపీలోని ఎంతో మంది సీనియర్లను మోదీ పక్కనపెట్టారని పేర్కొన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ.. ప్రధాని పోస్టు కోసం జాతీయ స్థాయి నాయకులను పక్కనపెట్టిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
బీజేపీకి బ్రహ్మరథం పట్టిన ఎల్కే అద్వానీ ఎక్కడ? అని అడిగారు. ప్రధాని అయ్యే అర్హత ఉన్న అద్వానీని మోదీ దూరం పెట్టాడని, ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదన్నారు. మోదీ వేధింపులు భరించలేక యశ్వంత్ సిన్హా పార్టీని వీడారు. తన పదవికి ఎలాంటి ప్రమాదం కలగొద్దనే ఉద్దేశంతో వెంకయ్య నాయుడిని కూడా మోదీ పక్కనపెట్టారని ఉదయనిధి పేర్కొన్నారు. తాను కరుణానిధి మనువడిని అన్న విషయాన్ని బీజేపీ నాయకులు గుర్తు పెట్టుకోవాలి. సీఎం పళనిస్వామిలా.. మోదీ మోకరిల్లను అని ఉదయనిధి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..