రాజన్న సిరిసిల్ల : ఈత సరదా ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చింది. ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు చెరువులో గల్లంతయ్యారు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని గంభీరావుపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన మహ్మద్ సమీర్ (17 )
రవితేజ ( 17)ఇంటర్ చదువుతున్నారు. కాగా,మధ్యాహ్నం మండల కేంద్రంలోని నమాజ్ చెరువులో ఈతకు వెళ్లారు.
ఈత రాని వీరు నడుముకు ఖాళీ తంప్సప్ బాటిల్ కట్టుకొని చెరువులో దూకారు. బాటిల్స్ తాళ్లు ఊడిపోవడంతో నీటిలో మునిగిపోయారు. గల్లంతైన విద్యార్థుల కోసం గజ ఈతగాల్లతో గాలిస్తున్నారు. రెవెన్యూ, అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.