ఖమ్మం : ఈ నెల24వ తేదీలోపు ఆయాలు, మినీ అంగన్వాడీలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఒరిజనల్ దృవపత్రాల పరిశీలన ఉంటుందని జిల్లా సంక్షేమ అధికారిణీ సీహెచ్ సంధ్యారాణి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐసీడీఎస్ పరిధిలోని 7 ప్రాజెక్టుల్లో 6 మినీ అంగన్వాడీ టీచర్లు, మరో 118 ఆయాల పోస్టులకు ఆన్లైన్ ధరఖాస్తులు స్వీకరించడం జరిగిందన్నారు.
అభ్యర్థులు సకాలంలో ఆయా ప్రాజెక్టు కార్యాలయాలలో తమ ఒరిజనల్ దృవపత్రాలను పరిశీలన చేయించుకోవాలని ఆమె సూచించారు. పదవ తరగతి మార్కుల ఆధారంగా మాత్రమే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఎటువంటి ప్రలోభాలకు గురి కావద్దని, దళారుల మాటలను నమ్మవద్దని దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సూచించారు.