జమ్మికుంట రూరల్ : టీఆర్ఎస్ సంక్షేమ పథకాలే తెలంగాణ రాష్ట్రానికి శ్రీ రామ రక్ష అని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని నగరం గ్రామ బీజేపీ నాయకులు బుర్ర సతీశ్ , రాచమల్ల శివ, రవితోపాటు ఇరువై మంది కార్యకర్తలు గురువారం వైస్ ఎంపీపీ పోల్సాని తిరుపతిరావు అధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి నాయకులకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. పార్టీలో చేరిన ప్రతి నాయకున్ని, కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు.
హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లారెడ్డితోపాటు తదితరులు ఉన్నారు.