హైదరాబాద్ : దేశ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం ఇటీవల ఈ -పంచాయతీ, ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు పొందిన నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును ఎంపీడీవో, జెడ్పీ సీఈవోల సంఘాల నేతలు సన్మానించారు. ఈ సందర్భంగా వారు తమ పదోన్నతుల గురించి మంత్రికి వినతి పత్రం అందజేశారు. డిప్యూటీ సీఈవోలకు సీఈవోలుగా పదోన్నతులు కల్పించిందున 76 మంది ఎంపీడీవోలకు డిప్యూటీ సీఈవో లుగా పదోన్నతులు ఇవ్వాలని వారు కోరారు.
మంత్రిని కలిసిన వారిలో జెడ్పీ సీఈవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేందర్ రావు, ఎంపీడీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సత్తయ్య, డీఆర్డీవో సంఘాల నేతలు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
గాలి ద్వారా కరోనా చాలా ఆందోళనకరం: ఎయిమ్స్ చీఫ్
పెద్దపల్లి జిల్లాలో..కరోనాతో అటెండర్ మృతి
భారీగా నిషేధిత గుట్కా ప్యాకెట్ల పట్టివేత