అమరావతి, జూలై :ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ సెకండియర్ ఫలితాలను రేపు విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఏపీ ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. రేపు సాయంత్రం నాలుగు గంటలకు ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేయనున్నారు. పరీక్ష ఫలితాలను వెబ్సైట్లలో అందుబాటులో ఉంచనున్నట్లు ఏపీ ఇంటర్ బోర్డ్ తెలిపింది.