ముంబై , జూలై : స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిశాయి. ప్రారంభ సెషన్ లో లాభాలతో మొదలై ఆతర్వాత సూచీలు కొంత నష్టాల్లోకి జారుకున్నా, కీలక రంగాల మద్దతుతో తిరిగి పుంజుకుని గరిష్ఠాలను తాకాయి. సెన్సెన్స్ 138 పాయింట్ల లాభంతో 52,975 వద్ద స్థిరపడగా… నిఫ్టీ 32 పాయింట్లు లాభపడి 15,856 వద్ద ముగిసింది.
జొమాటో లాభాల్లో దూసుకెళ్లింది. దీనిషేరు 52 శాతం ప్రీమియంతో సూచీల్లో రూ.116 కు చేరుకున్నది. చివరకు 66 శాతం లాభంతో రూ.126 వద్ద స్థిరపడింది. లిస్టయిన తొలిరోజే కంపెనీ మార్కెట్ విలువ రూ.1 లక్ష కోట్లకు చేరుకోవడం విశేషమని మార్కెట్ నిపుణులు వెల్లడిస్తున్నారు.