ముంబై,జూన్ 11 : స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడం, రుతుపవనాల రావడం వంటి సానుకూల పరిణామాలతో ఈరోజు మార్కెట్లు కాస్త ఊపందుకున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 300 పాయింట్లకు పైగా ఎగిసి 52,600 పాయింట్లకు పైకి చేరుకుంది. నిఫ్టీ 15,900 దిశగా కొనసాగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లు ఇవాళ మిశ్రమంగా కదలాడుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.94 వద్ద ట్రేడవుతున్నది.