తిరుమల : తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వారాంతపు సెలవు దినాలు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లు(Compartments) అన్నీ నిండి కృష్ణతేజ గెస్ట్హౌజ్ వరకు క్యూలో నిలబడ్డారు. నిన్న స్వామివారిని 87,762 మంది భక్తులు దర్శించుకోగా 43,753 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.61 కోట్లు వచ్చిందని వివరించారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.
జూన్ 21న ఆస్థానమండపంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day)
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈనెల 21న తిరుమల ఆస్థానమండపంలో ఉదయం 6 నుంచి 8 గంటల వరకు యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ ఆధ్వర్యంలో యోగా శిక్షకులు ఇందులో యోగాసనాలు, వాటి వల్ల శారీరకంగా, మానసికంగా కలిగే ఉపయోగాలను తెలియజేస్తారని వెల్లడించారు. ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్తోపాటు టీటీడీ ఉద్యోగులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.