భద్రాద్రి కొత్తగూడెం : నిద్రిస్తున్న ముగ్గురు మహిళలను పాము కరువడంతో ఓ మహిళ మృతి చెందగా.. మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం పెనగడప పంచాయతీ పరిధిలోని ములుగు గూడెం పాలవాగు గుంపులో నిద్రిస్తున్న ముగ్గురు మహిళలను కట్లపాము కాటేసింది.
దీంతో ఈడిమే అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. భీమే, రామే అనే మహిళలను కొత్తగూడెం ప్రభుత్వ దవాఖానకు రలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.