జగిత్యాల: జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మండలం తుమ్మెనాలలో విషాదం నెలకొన్నది. తుమ్మెనాల చెరువులో పడి ముగ్గురు బాలురు మృతిచెందారు. ఆదివారం ఉదయం చెరువులో ఈతకు వెళ్లిన ముగ్గురు అందులో మునిగిపోయారు. గుర్తించిన స్థానికులు వారిని అందులో నుంచి వెళికితీశారు. మృతులను యశాంత్ (13), శరత్ (12), నవదీప్ (15)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకు పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.