మద్దూరు(ధూళిమిట్ట), మే 20: రాష్ట్ర శ్రేయస్సే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. శుక్రవారం మద్దూరు మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలకతీతంగా ప్రభుత్వ పథకాలు ప్రతిఒక్కరికీ చేరుతున్నట్లు తెలిపారు. సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో తెలంగాణ దేశానికే రోల్మోడల్గా నిలుస్తున్నదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఇన్ని పథకాలు అమలవుతున్నాయా? అని ప్రశ్నించారు. రేవంత్రెడ్డి, బండి సంజయ్ బ్రోకర్ మాటలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావాలని చూస్తున్నారన్నారు. మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చి ఆడబిడ్డల కష్టాలు తీర్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.
మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో ప్రజలు మంచినీళ్ల కోసం ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తుచేశారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని కేంద్ర మంత్రులు మెచ్చుకున్నారని తెలిపారు. ప్రతిపక్ష నాయకులు చిల్లర రాజకీయాల కోసం సీఎం కేసీఆర్ను విమర్శిస్తున్నారన్నా రు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల విషయంలో కేంద్ర ప్రభుత్వం నోరెందుకు మెదపడంలేదని మండిపడ్డారు. రాబో యే హరితహారంలో ప్రతిఒక్కరూ బాధ్యతగా పది మొక్కలు నా టాలని పిలుపునిచ్చారు. ఓడిపోయిన తర్వాత నియోజకవర్గం ముఖం చూ డని పొన్నాల లక్ష్మయ్య ఏ ముఖం పెట్టుకొని గ్రామాలకు వస్తుండో చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైస్ఎంపీపీ మలిపెద్ది సుమలతామల్లేశం, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మంద యాదగిరి, పీఏసీఎస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, తహసీల్దార్లు నరేందర్, అశోక్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.