కేంద్రంలోని బీజేపీ సర్కారు అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మికలోకం భగ్గుమంది. దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మెలో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొలిరోజైన సోమవారం సమ్మె సక్సెస్ అయింది. ప్రజాసంఘాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంక్ ఉద్యోగులు, బీఎస్ఎన్ఎల్, అంగన్వాడీ ఉద్యోగులు, తదితర సంఘాలు ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలతో హోరెత్తించారు. ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. కాగా.. సింగరేణి గనులు, ఓసీపీలు బోసిపోయాయి. టీబీజీకేఎస్, పలు కార్మిక సంఘాలు గనులపై ర్యాలీలు నిర్వహించారు. కార్మికులు విధులకు హాజరుకాకపోవడంతో ఉత్పత్తి నిలిచింది.
ఎదులాపురం/నిర్మల్ అర్బన్/నిర్మల్ టౌన్, మార్చి 28 : హక్కులను కాలరాస్తూ, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కా ర్మిక చట్టాలను మారుస్తూ దేశ సంపదను వారి కి దోచిపెడుతున్నారని కార్మికలోకం ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు రోజుల సార్వత్రిక సమ్మెలో భాగంగా మొదటి రోజు సోమవారం విజయవంతమైంది. కార్పొరేట్ సంస్థల అనుకూల, శ్రామిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్య తిరేకంగా సమ్మె కొనసాగింది. మోదీ సర్కారు విధానాలను వ్యతిరేకిస్తూ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. బొగ్గు పెళ్లకూడా బయటకు వెళ్లకుండా సింగరేణి కార్మికులు పకడ్బందీగా సమ్మెను సక్సెస్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నారని కేంద్ర సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఎస్ఎన్ఎల్, సింగరేణి, అంగన్వాడీ, పలు సంఘాలు, తదితర ఉద్యోగులు పాల్గొన్నారు. సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సమ్మెను జయప్రదం చేశారు. టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పలు దఫాలుగా సమ్మె చేస్తున్నామని, ఇప్పటికైనా కేంద్రం గుర్తించి సింగరేణికి బ్లాకులు కేటాయించాలని కార్మికులు డిమాండ్ చేశారు.
బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ సింగరేణి వ్యాప్తంగా చేపట్టిన సమ్మె విజయవంతమైంది. ఉదయం షిఫ్టు నుంచే కార్మికులు స మ్మెలో పాల్గొన్నారు. 23 భూగర్భ, 19 ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. సమ్మెకు టీబీజీకేఎస్ మద్దతు ప్రకటించింది. సమ్మెలో భాగంగా కార్మిక సంఘాలు బొగ్గు గనుల వద్ద నిరసనలు చేపట్టాయి. కేంద్రం ప్రైవేటీకరణను మానుకోవాలని, లేకుంటే ఉద్యమాలు తప్పవని కార్మిక నేతలు హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎల్ఐసీ, ఇండియన్ రైల్వేస్, ఎయిర్ ఇండియా, నేవీ, మల్టీనేషనల్ కంపెనీలతో పాటు మరికొన్ని సంస్థలను తక్కువ ధరలకు ప్రైవేట్ సంస్ధలకు ధారాదత్తం చేస్తున్నదని ఆరోపించారు. ప్రైవేటీకరణను నిరసిస్తూ ఈనెల 28, 29 తేదీల్లో రెండు రోజుల్లో 48 గంటల పాటు దేశవ్యాప్త పిలుపునివ్వగా, మొదటి రోజు సోమవారం విజయవంతమైంది.
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా సోమవారం సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. ఇందు లో భాగంగా సీఐటీయూ, ఏఐటీయూసీ, ఎల్ఐసీ, కార్మికులు, బ్యాంక్, అవుట్ సోర్సిం గ్ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతి రేకంగా నిరసనలు చేపట్టారు. ఆదిలాబాద్ లోని రిమ్స్ వద్ద, ఇచ్చోడ మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో, తలమడుగు మం డలంలోని ఏఐటీయూసీ అనుబంధ సంఘం అంగన్వాడీ వర్కర్స్ యునియన్ ఆధ్వర్యంలో సమ్మె చేపట్టారు. ఉట్నూర్ మండల కేంద్రంలో టీఏజీఎస్ ఆధ్వర్యంలో అనుబంధ సంఘం అయిన అంగన్వాడీ ఆధ్వర్యంలో నిరసన తెలిపి, తహసీల్దార్కు వినతిపత్రం అందజే శా రు. బోథ్ మండల కేంద్రంలో ఆల్ ఇండియా బ్యాంక్ అసొసియేషన్ సంఘం నాయకులు టీ జీబీ, యూనియన్ బ్యాంక్ ముందు నిరసన తెలిపారు. ఇంద్రవెల్లి మండలంలోని సీఐటీ యూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, తహసీ ల్దార్కు వినతి పత్రం అందజేశారు. బజార్హ త్నూర్ మండలంలోని ఏఐటీయూసీ భవన ని ర్మాణ కార్మిక, అంగన్వాడీ సంఘం నా యకులు ధర్నా చేపట్టారు. నేరేడిగొండ మం డలంలో ఎంప్లాయీస్ యూనియన్ సీఐటీ యూ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో టో ల్ప్లాజా వద్ద సమ్మె చేపట్టారు.
నిర్మల్ జిల్లాలోని మంజులాపూర్లో బీమా ప్రీమియంపై జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఐసీఈయూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కేంద్రం పెంచిన పెట్రోల్, డీజి ల్, సిలిండర్ ధరలు తగ్గించాలని కోరుతూ బీ ఎస్పీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అంబేద్కర్ ట్యాంక్ బండ్ వద్ద మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లక్ష్మణచాంద మండల కేం ద్రంలోఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
కేంద్రం ప్రభుత్వం విద్యుత్ సంస్థలను ప్రైవే టీకరిస్తామనే నిర్ణయనికి వ్యతిరేకంగా జిల్లా కేంద్రంలోని విద్యుత్శాఖ కార్యాలయం వద్ద ఉద్యోగులు, సిబ్బంది మహాధర్నా నిర్వహిం చారు. బీజేపీ ప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన నుంచి పట్టణంలోని పలు వీధులు గుండా ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌక్ వద్ద కేంద్ర ప్రభు త్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. సింగరేణిలోని నాలుగు బొగ్గు బ్లాకులు సింగరేణికే కేటాయించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గోలేటి టౌన్షిప్లో గల బస్డాండ్ నుంచి గోలేటి జీఎం కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. రెబ్బెన మండల కేంద్రంలోని అంతర్రాష్ట్ర రహదారిపై ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటోకు తాడు కట్టి తాగి నిరసన వ్యక్తం చేయడంతోపాటు గ్యాస్ సిలిండర్తో రాస్తారోకో నిర్వహించారు. బెల్లంపల్లి ఏరియాలోని గోలేటిటౌన్షిప్లో సమ్మెకు మద్దతుగా టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.